Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు.
తమ ప్రాజెక్టుల వల్లనే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలిచిందన్నారు. ‘గుజరాత్లో రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ నమోదు చేసుకున్నందుకు బీజేపీ, మోడీకి ప్రత్యేక శుభాకాంక్షలు. మహారాష్ట్ర ప్రాజెక్టులు గుజరాత్కు తరలిండం ఈ విజయానికి దోహదపడింది’ అని అన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఓటు బ్యాంకును కోల్పోయింది. కేవలం 17 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు 4 స్థానాలు గెలుచుకొన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ భారీగా గండికొట్టింది.