డెహ్రాడూన్: అరుణాచల్ ప్రదేశ్లో ఇద్దరు సైనికులు (Soldiers) కనిపించకుండా పోయారు. గర్వాల్ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గత 14 రోజులుగా ఆచూకీ లభించడం లేదు. ఉత్తరాఖండ్కు చెందిన హరేంద్ర నేగి, ప్రకాశ్ సింగ్ రాణా అరుణాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. వారిద్దరు గత నెల 28 నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు సైనిక అధికారులు సమాచారం అందించారు. అయితే ఈ విషయంపై సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, ప్రకాశ్ సింగ్ భార్య మమతా రాణాకు గత నెల 29న సైన్యాధికారుల నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త కనిపించకుండా పోయాడని చెప్పారని మమత తెలిపారు. జూన్ 9న మరోసారి ఫోన్చేసి ప్రకాశ్తోపాటు మరో సైనికుడు నదిలో కొట్టుకుపోయినట్లు భావిస్తున్నామని చెప్పారన్నారు. తన పదేండ్ల కుమారుడు, ఏడేండ్ల కుమార్తె గత 14 రోజులుగా తండ్రికోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు.
ఇక ఇద్దరు సైనికులు నదిలో కొట్టుకుపోయారనే విషయం నమ్మలేకుండా ఉందని హరేంద్ర నేగి భార్య పూనమ్ నేగి అన్నారు. నేగి దంపతులకు మూడేండ్ల క్రితమే వివాహయింది. వారికి ఏడాది వయస్సున్న చిన్నారి ఉన్నది.