ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్నా సమీపంలోని చందన్జిరా వద్ద సమృద్ధి హైవేపై (Road Accident) కారును, కంటైనర్ వాహనం ఢీకొనడనంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటన జరిగిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించిన కంటైనర్ వాహనం డ్రైవర్ను వెంటాడిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు బిహార్లోని భాగల్పూర్ రైల్వేస్టేషన్ వీఐపీ గెస్ట్ రూమ్లో అగ్నిప్రమాదంతో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భాగల్పూర్ రైల్వే స్టేషన్లోని స్పెషల్ గెస్ట్ రూం నుంచి అనూహ్యంగా మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించామని రైల్వే అధికారి సత్యేంద్ర కుమార్ వెల్లడించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో పాటు ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదని కుమార్ తెలిపారు. ప్రయాణీకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు.
Read More
Naya Mall | బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్కు ఈ డివైజ్ పెట్టుకుంటే బోలెడన్నీ లాభాలంట!!