ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టుతో పాటు మరో దళ సభ్యుడు ఉన్నారు.
బీజాపూర్ జిల్లా బద్దేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని బద్దెపారా అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీస్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.
ఇరువర్గాల మధ్య సుమారు 20 నిమిషాల పాటు భీకర పోరు జరగడంతో.. ఆ ధాటికి తాళలేక మావోయిస్టులు అటవీమార్గంలో పారిపోయారు. ఘటనాస్థలి నుంచి ఆయుధ, వస్తు సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.