ముంబై: కవలలైన ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కవల సోదరీమణులైన పింకీ, రింకీ ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత కాలం కిందట వారి తండ్రి చనిపోయాడు. అయితే చిన్నప్పటి నుంచి నివసిస్తున్న ఇంటిలో తల్లితో కలిసి ఉంటున్నారు. కాగా, షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ గ్రామానికి చెందిన అతుల్ అనే వ్యక్తి ముంబైలో ట్రావెల్ బిజినెస్ చేస్తున్నాడు. చూసేందుకు ఒకేలా ఉండే కవలలైన పింకీ, రింకీ కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది.
ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న ఆ కవల సోదరీమణులు అతుల్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దీంతో అతుల్ సొంత గ్రామమైన అక్లూజ్లో శుక్రవారం వారి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు వధువులు ఒకే పూల దండను వరుడి మెడలో వేశారు.
మరోవైపు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ పెళ్లి చెల్లుతుందా అని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. మీమ్స్, ఇమోజీలతో మరి కొందరు జోకులు వేశారు.
Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Love (@LocalBabaji) December 4, 2022