కోల్కతా: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. సగర్దిఘి ఉప ఎన్నికలో టీఎంసీ ఓడిపోయిన తర్వాత గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని ఫలితాలు బయట పెట్టాయన్నారు.
ఈ మూడు ప్రత్యర్థి రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా తాము ఒంటరి పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్, సీపీఎం బీజేపీ సాయంతో తనతో పోరాడుతున్నాయని, అలాంటప్పుడు అవి తమను బీజేపీ వ్యతిరేక పార్టీలని ఎలా చెప్పుకుంటాయి అని మమత ప్రశ్నించారు. ఓటర్లను ఒకే దిశలో నడిపించడానికి ఈ మూడు పార్టీలు మతం కార్డు ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు.