కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి చేపట్టాలని కోరుతూ పాలక టీఎంసీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బెంగాల్ లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, మరణాలను పరిగణనలోకి తీసుకుని తమ వినతిని పరిశీలించాలని ఎస్ఈసీని కోరారు.
కొవిడ్ పరిస్థితి తీవ్రత నేపథ్యంలో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి నిర్వహించాలని ఈనెల 15న సీఎం, తమ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఈసీని అభ్యరించారని, దీనిపై సానుకూలంగా స్పందించాలని తాము సీఈసీని కోరామని టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ పేర్కొన్నారు.ఫిబ్రవరి 26న ఎన్నికలను ప్రకటించినందున పార్టీలు, అభ్యర్ధులు 52 రోజుల పాటు ప్రచారంలో నిమగ్నమయ్యారని, మూడు దశల పోలింగ్ ను ఒకేసారి పూర్తిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీఎంసీ ఈసీకి నివేదించింది. కొవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మిగిలిఉన్న ఆరు, ఏడు, ఎనిమిదో దశ పోలింగ్ ను కలగలిపి మీకు సౌలభ్యం ఉన్న తేదీలో ఒకేసారి నిర్వహించాలని ఈసీని టీఎంసీ కోరింది.