న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య డైలాగ్ వార్కు తెరలేచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, సువేందు అధికారి సహా పలువురు కాషాయ పార్టీ నేతలు మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ సర్కార్ను డిమాండ్ చేశారు.
ప్రజలకు దీపావళి బహుమతిగా కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ను తగ్గించాలని బీజేపీ ఎమ్మెల్యే, విపక్ష నేత సువేందు అధికారి దీదీ సర్కార్ను కోరారు. మరోవైపు ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతోనే పెట్రో ధరలను కేంద్రం తగ్గించిందని, ఇది చవకబారు రాజకీయ జిమ్మిక్కని టీఎంసీ అభివర్ణించింది.