న్యూఢిల్లీ, జూలై 3: దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహై, దుహై డిపోల మీదుగా ఈ రైలు ప్రయాణించనున్నది. ఈ రైళ్లకు ‘రాపిడెక్స్’ అని పేరు పెట్టారు. ఇందులో మహిళలకు ప్రత్యేక బోగీని ఏర్పాటు చేశారు. ఈ రైలు సేవలను దశలవారీగా విస్తరిస్తారు.