Bull Pritam | ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది (Yamuna River) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. డేంజర్ మార్క్ ను దాటి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ సహా పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు సహా పశువులు, జంతువులు కూడా చిక్కుకుపోయాయి.
వరదల కారణంగా నోయిడా (Noida)లో చిక్కుకుపోయిన మూగజీవాలను విపత్తు సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ బెటాలియన్ కు చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF).. తాజాగా కొన్ని పశువులను రక్షించింది. అందులో ఇండియాలోనే నెంబర్ 1 బుల్ ప్రీతమ్ (Bull Pritam) జాతికి చెందిన ఎద్దు సహా మరో మూడు పశువులు ఉన్నాయి. కాగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన ఈ ఎద్దు ధర ఏకంగా రూ.కోటి. ఈ విషయాన్ని ఘజియాబాద్ కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఎద్దుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
#आपदासेवासदैवसर्वत्र
Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz— 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023
Also Read..
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Triple Talaq | కట్నం కింద కారు ఇవ్వలేదని.. నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్