Arvind Kejriwal | యమునా నది (Yamuna River) కాస్త నెమ్మదించినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. డ్రైన్ రెగ్యులేటర్లో పూడిక తీయకపోవడంతో వరద వెనక్కి మళ్లడంతో కొన్ని ప్రాంతాలు వరదకు గురయ్యాయి. నగరంలోని ముకుంద్ పుర్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలు సరదా కోసం వరద నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. సరదా కోసం వరద ప్రవాహంలో ఈత కొట్టడం, సెల్ఫీల కోసం ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడొద్దని కోరారు.
‘కొందరు చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహంలో ఈత కొట్టేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు, నీరు నిండిన ప్రదేశాల్లో వీడియోలు షూట్ చేసేందుకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. వరద కాస్త తగ్గినప్పటికీ ఆయా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏక్షణంలో నైనా నీటి ప్రవాహం పెరగొచ్చు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.
మరోవైపు గత మూడు రోజులుగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునమ్మ కాస్త నెమ్మదించింది. శనివారం ఉదయం 10 గంటల సమయానికి యమునా నది (Yamuna River)లో నీటి మట్టం 207.48 మీటర్లకు చేరింది.
Also Read..
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Bull Pritam | వరదల నుంచి ఇండియాస్ నెంబర్ 1 బుల్ ను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. దీని ధర తెలిస్తే షాకే..!
Triple Talaq | కట్నం కింద కారు ఇవ్వలేదని.. నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్