న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా మంచుకు కురుస్తుండటంతో ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బుధవారం ఉదయం 5.30 గంటలకు ఇందిరాగాంధీ విమానాశ్రయం వద్ద 500 మీటర్ల దూరం వరకు ఏమీ కనిపించనంత దట్టంగా మంచు కురుస్తున్నదని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో భారీగా మంచు కురుస్తున్నదని తెలిపింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొన్నది.
కాగా, మంచు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నదని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. పలు విమానాలను దారి మళ్లించామని, మరికొన్ని ఆలస్యంగా బయలుదేరుతాయని ప్రకటించారు. తాము ప్రయాణించాల్సిన విమానాల వివరాల గురించి సంబంధిత సంస్థలను అడిగి తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. చండీగఢ్, వారణాసి, లక్నో నుంచి ఢిల్లీ వచ్చే విమానాలను దారిమళ్లించామని తెలిపారు. ఇక ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Kind attention to all flyers!#Fog #FogAlert #DelhiAirport pic.twitter.com/3aDhJGMBtq
— Delhi Airport (@DelhiAirport) December 20, 2022
trough and the fog layer lies below it.
Visibility (meters) recorded at 0530 hrs IST of today:
Amritsar-25, Bhatinda-0, Ganganagar-25, Ambala-50, Bareilly-25, Bahraich-50, Varanasi-50 pic.twitter.com/Gyk1Ek4SBV— India Meteorological Department (@Indiametdept) December 21, 2022
Visibility reduces as a thick layer of fog grips Delhi; Visuals from Yamuna Bank and Akshardham pic.twitter.com/2NjFB940rf
— ANI (@ANI) December 21, 2022