హైదరాబాద్, ఫిబ్రవరి 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మట్టిలో కలిసిపోదు. నీటిలో కరిగిపోదు. గాలిలో ఏకమవ్వదు. పోనీ అలాగే ఉంచుదామంటే ప్రాణులకు పెనుముప్పుగా మారుతుంది. ‘ప్లాస్టిక్’ మహమ్మారి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మనుషులు, జంతువుల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థికాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ప్లాస్టిక్ను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో భూగోళమంతా ప్లాస్టిక్మయంగా మారిపోతున్నది. ప్రస్తుతం భూమి మీద ఉన్న మొత్తం జంతువుల బరువు కంటే ప్లాస్టిక్ బరువు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్టు తేలడం ఆందోళన కలిగిస్తున్నది.
సముద్రపు ఉప్పు, చక్కెర, తేనె, బియ్యం, చేపలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, టీబ్యాగ్స్, ప్రాసెస్డ్ ప్రొటీన్స్, బాటిల్ వాటర్, బీర్, బాటిల్ సాఫ్ట్ డ్రింక్స్
రక్తం, తల్లిపాలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, జీర్ణాశయం, కాలేయం, శుక్రకణాలు, ప్లీహం, గర్భస్థమావి, ఎముకలు, మృదులాస్థి, మూత్రము, చెమట, వెంట్రుకలు, చర్మం, శ్వాసకోశనాళాలు
కణాలు, కణజాలాలు ధ్వంసమవ్వడం, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులపై ప్రభావం, జీర్ణాశయ సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు, సంతాన సమస్యలు
