న్యూఢిల్లీ: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపీ మసీదులో హిందువులు పూజ చేసుకునేందుకు అనుమతించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. మసీదును వేరే ప్రదేశంలో నిర్మించుకొని దాన్ని కాశీ విశ్వనాథ సొసైటీకి అప్పగించాలని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
జ్ఞానవాపీ మసీ దు స్థానంలో పూర్వం హిందూ ఆలయం ఉండేదని ఇటీవల ఏఎస్ఐ చేసిన పరిశోధనల్లో మరోసారి నిర్ధారణ అయ్యిందని, దానిని హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.