యవత్మాల్: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగా నిలిచింది.
కొవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం పిల్లలు మొబైల్ఫోన్లు వాడడం ప్రారంభించారని, అనంతరం వాటికి బానిసలుగా మారారని సర్పంచ్ గజానన్ తెలిపారు. ఆన్లైన్ గేమ్స్, ఇతర సైట్లు చూస్తూ సమయం వృథా చేస్తున్నందున ఫోన్లపై నిషేధం విధించామన్నారు.