న్యూఢిల్లీ, మార్చి 17: ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951లోని సెక్షన్ 14(2) ప్రకారం లోక్సభ ఎన్నికల తేదీలకు నోటిఫికేషన్ జారీ చేయడం కోసం ఇప్పటికే కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల కమిషన్ సిఫారసు చేసింది.
ఈ మేరకు ఆదివారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. ఎన్నికల తేదీలను రాష్ట్రపతికి పంపి, ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందిగా సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్లతో కూడిన గెజిట్ రానుంది. కాగా, ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశతో ప్రారంభం కానున్నాయి.