న్యూఢిల్లీ : హైవేలపై నడిచే పాదచారుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైవేలు ఉన్నది జనం యథేచ్ఛగా తిరగడానికి కాదని తెలిపింది. పిటిషనర్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దీనిపై పిటిషనర్ కోరినట్లుగా ఆదేశాలను ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. పిటిషనర్లు ఈ అంశాలపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చునని చెప్తూ, పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.