తిరువనంతపురం: కేరళపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నదని అధికార సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ సర్కారు తీరును ఎండగట్టేందుకు వచ్చే నెల 11 నుంచి నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపింది.
సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను తగ్గించడం, అప్పుపై పరిమితులు విధిస్తూ కేంద్రం ఇబ్బంది పెడుతున్నది’ అని పేర్కొన్నారు.