కోల్కతా, మే 29: కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాయ్న్ బిశ్వాస్ సోమవారం టీఎంసీలో చేరారు. బీడీ బరోన్గా సుపరిచితులైన బిశ్వాస్ సాగర్డిఘి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బరోన్ను అభిషేక్ బెనర్జీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్, సాగర్డిఘి ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా టీఎంసీలో చేరడంతో కాంగ్రెస్ బలహీనపడింది.