న్యూఢిల్లీ: భారత్లోని నిజమైన సంక్షోభాల పట్ల కేంద్ర బడ్జెట్ గుడ్డిగా ఉండిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని, తయారీ రంగం పతనం అవుతున్నదని, రైతులు నిరాశలో ఉన్నారని ఆయన తెలిపారు.
కుటుంబ పొదుపు తగ్గుతున్నదని, పెట్టుబడిదారులు మూల ధనాన్ని ఉపసంహరించుకుంటున్నారని, ప్రపంచ పరిణామాలు షాక్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. అయితే వీటన్నింటిని బడ్జెట్లో విస్మరించారని దుయ్యబట్టారు.