డెహ్రాడూన్: ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో విపరీతంగా మంచు కురుస్తున్నదని, ఈ పరిస్థితి రానున్న రెండుమూడు రోజులు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది.
మంచుతోపాటు అప్పుడప్పుడు వర్షం కురుస్తుండంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్నదని హెచ్చరించింది. కాబట్టి యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేదార్నాథ్ దర్శన రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.