లక్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్ను సమాజ్వాదీ పార్టీ ప్రారంభించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తామని, ఆధారాలు కూడా చూపుతామని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దీనిని తమ ప్రభుత్వమే ప్రారంభించిందని అఖిలేష్ యాదవ్ ఆదివారం తెలిపారు. ఈసారి పక్కగా ప్రూఫ్తో మాట్లాడతామని అన్నారు.
రైతులకు రెట్టింపు ఆదాయాన్ని అందించకుండా బీజేపీ ప్రభుత్వం తప్పించుకునేందుకే ఇదంతా చేస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ఇవన్నీ చేస్తున్నదని ఆరోపించారు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎవరు హామీ ఇచ్చారో అందరికీ తెలుసు. ఎరువులు అందుబాటులో లేనప్పుడు, అన్నీ ఎగుమతి అవుతున్నప్పుడు, రైతుల ఆదాయం ఎలా పెరుగుతుంది? ప్రజలు ఈ ప్రశ్నలు అడుగుతారనే వారు భయపడి ఇదంతా చేస్తున్నారు’ అని మండిపడ్డారు.