నిరాడంబరంగా సీతారాముల కల్యాణం
వేదమంత్రాల నడుమ వేడుక
కొవిడ్ నిబంధనలు పాటిస్తూభక్తుల హాజరు
చెన్నూర్, ఏప్రిల్ 21: చెన్నూర్ పట్టణంలోని బడా హనుమాన్ ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు శంకరయ్య ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కోటపల్లి, ఏప్రిల్ 21 : మండలంలో కోటపల్లి, షట్పల్లి, మల్లంపేట, పంగిడిసోమారం తదితర గ్రామాల్లో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కోటపల్లి మండలకేంద్రంలోని హనుమాన్ మందిర్లో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగల శైలజ-శ్రీనివాస్, సర్పంచ్ రాగం రాజక్క, ఆలయ పూజారులు వారణాసి నాగేందర్, కాగితపు బ్రహ్మయ్య, గ్రామస్తులు కొట్టె నారాయణ, వంగల సంతోష్, ఇప్ప నారాయణ, కోమట్ల శ్రీకాంత్, పడాల శంకర్, కాశెట్టి రామన్న తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని బుగ్గ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, ఈవో పెండ్యాల వామన్రావ్, సర్పంచ్ జిల్లపల్లి స్వరూప వెంకటస్వామి, శ్రీరాంభట్ల వేణుగోపాలశర్మ, ఆలయ కమిటీ సభ్యులు భావనపెల్లి గోపి, ఆలయ క్లర్క్ భాను తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లోనూ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దండేపల్లి, ఏప్రిల్21 : దండేపల్లి మండల కేంద్రంలోని సీతారామాలయంతో పాటు అన్ని గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సన్నాయి వాయిద్యాలతో వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
మందమర్రి, ఏప్రిల్ 21 : మందమర్రి పట్టణంలోని ఆలయాల్లో శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో గల శ్రీపంచముఖి ఆంజనేయ ఆలయం, మూడో జోన్ రామాలయం, మార్కెట్ ఏరియాలోని సాయిబాబా ఆలయం, హనుమాన్ ఆలయం, యాపల్ ఏరియాలోని కోదండ రామాలయం, రామన్కాలనీలోని హనుమాన్ ఆలయాల్లో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామాలయంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదెలు, సింగరేణి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, లక్ష్మి దంపతులు, ఏజెంట్ రాంచందర్, ఏవీ.రెడ్డి, కేకే ఐదు గని మేనేజర్ భూశంకరయ్య దంపతులు పాల్గొన్నారు. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో పట్టణ ఎస్ఐ భూమేశ్ పాల్గొన్నారు. ఆలయాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాండూర్, ఏప్రిల్ 21: మండలంలో మాదారంలోని కోదండరామాలయంలో, ఐబీ శివ పంచాయతన భక్తాంజనేయ దేవాలయంలో, కొత్తపల్లి, రేపల్లెవాడ, అచ్చులాపూర్ హనుమాన్ ఆలయం, సేవాజ్యోతి శరణాలయాల్లో కల్యాణా న్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమకంలో వేదపండితుడు ముద్దు ఆవదూతశర్మ, ఐబీ హనుమాన్ దేవాలయంలో నవీన్శర్మ, ఆయా చోట్ల వేదపండితులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు, బెల్లం పానకం, వడపప్పు వితరణ చేశారు.
శ్రీరాంపూర్, ఏప్రిల్ 21 : సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికుల కాలనీల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీలోని భక్తాంజనేయాలయంలో వేద పండితులు కొమ్మెర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ దంపతులు సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సీతారాముల విగ్రహాలతో ఆలయంలోనే శోభాయాత్రను భక్తులు నిర్వహించారు. అనంతరం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో నస్పూర్ చైర్మన్ దంపతులు ఇసంపెల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆర్కే 8 కాలనీలోని గణేశ్ మందిర్లో, గీతా ప్రశాంతి నిలయంలో గీతా సత్సంగం అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. సీతారాముల తలంబ్రాలు, విగ్రహాలతో భక్తులు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్కే 6కాలనీలోని శివాలయం, తాళ్లపల్లి, సింగాపూర్లోని ఆంజనేయాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాలు జరిగాయి.