న్యూఢిల్లీ : అమెరికా నుంచి దిగుమతయ్యే ఎనిమిది ఉత్పత్తులపై గతంలో విధించిన కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. శనగలు, యాపిల్, పప్పు, తాజా బాదం, బాదం గింజలు, వాల్నట్స్, బోరిక్ యాసిడ్, డయాగ్నోస్టిక్ వస్తువులపై సుంకాన్ని ఎత్తివేయనున్నారు.
2018లో భారత్ నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాన్ని విధించింది. దీంతో ప్రతీకార చర్యగా 2019లో భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని వేసింది.