చెన్నై, జూన్ 14: తమ రాష్ట్ర మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకొంది. దీంతో ఇకపై రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే సీబీఐ ముందుగా తమిళనాడు సర్కారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే తెలంగాణ సహా తొమ్మిది రాష్ర్టాలు సీబీఐకి సాధారణ సమ్మతిని నిరాకరించగా, ఆ జాబితాలో పదో రాష్ట్రంగా తమిళనాడు చేరింది.