బెంగళూరు, నవంబర్ 13: కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించడంతో అసంతృప్తి రగిలింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ సీనియర్ నేతలు నిలదీస్తున్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోకుండా విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన యెడియూరప్ప అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.