Pension | న్యూఢిల్లీ: ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల పాటు తిప్పించడం తీవ్రమైన అంశమని జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుడు ఉత్తమ్ లాల్ సింగ్కు ఇవ్వాల్సిన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్ను 1980 నుంచి ఆరు శాతం వడ్డీతో 12 వారాల్లోగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చారు.
1927లో జన్మించిన సింగ్ స్వాతంత్య్ర సమరం సందర్భంగా జరిగిన క్విట్ ఇండియా, ఇతర ఉద్యమాల్లో పొల్గొన్నారు. అయితే తనకు పెన్షన్ ఇవ్వాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.