శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. గురువారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకడు పాకిస్థాన్కు చెందినవాడు. లష్కరే ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తూ మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి జిల్లా కాలాకోట్ అటవీ ప్రాంతం సమీపంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికాధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.