Bypolls | సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఏడు రాష్ర్టాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 10న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అధికారులు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్టాలా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్లోని జలంధర్ వెస్ట్, హిమాచల్లోని డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బీహార్లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మూడు (ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్) రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్ ముందంజలో ఉన్నారు. ఇక హమీర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్లోని జలంధర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు. బీహార్లోని రూపాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీ(యూ) అభ్యర్థి కళాధర్ ప్రసాద్ మండల్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్లోని మాంగ్లౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ మహ్మద్ నిజాముద్దీన్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
Bye Election to Assembly Constituencies: The counting of votes for the 13 Assembly seats spread across 7 states is underway.
As per initial trends by ECI, BJP candidate from Himachal Pradesh’s Dehra Assembly constituency, Hoshyar Singh is currently leading.
Congress… pic.twitter.com/s7MbqjOkKj
— ANI (@ANI) July 13, 2024
Also Read..
Harshika | అగ్ని సాక్షిగా.. భగవాన్ శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యూపీ యువతి
Dinner | రాత్రి భోజనం ఎంత తొందరగా తింటే అంత మేలు..
Karnataka | సర్కారు ఖజానా ఖాళీ.. గుదిబండల్లా కర్ణాటక కాంగ్రెస్ గ్యారెంటీలు.. !