న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేసే వారిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీవ్రంగా హెచ్చరించింది. త్వరలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు జరగనున్నాయని, పేపర్ లీక్లు, తప్పుడు లింక్లు, మాదిరి ప్రశ్నపత్రాలు పేరుతో తప్పుడు వార్తలు ప్రసారం చేసినా, ప్రచురించినా, వదంతులు వ్యాపింపజేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే 10, 12 పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని తెలిపింది. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు వార్తలు వ్యాపింపజేసినా కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.