న్యూఢిల్లీ, మే 4: ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది. ఉల్లి పంట దిగుబడి తగ్గుతుందని, ధరలు పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో గత డిసెంబరులో కేంద్రం విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది.
మన దేశం నుంచి గత 4 – 5 ఏండ్లుగా ఏటా 17 లక్షల నుంచి 25 లక్షల టన్నుల ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతున్నది. ప్రస్తుతం ఉల్లి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఈ నిర్ణయం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.