న్యూఢిల్లీ: ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు పొందటాన్ని ప్రోత్సహించబోమని, ఉద్యోగుల పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రభు త్వం అనేక పద్ధతుల్ని అనుసరిస్తున్నదని ఓ ప్రకటనలో పేర్కొన్నది.