న్యూఢిల్లీ, ఆగస్టు 8: పాకిస్థాన్ ఏజెంట్స్ భారత వైమానికదళానికి చెందిన ఐఏఎఫ్ అధికారి (వింగ్ కమాండర్)కు వలపు వల వేశారు. సోషల్మీడియా చాటింగ్తో పరిచయమైన ఓ మహిళ వల పన్ని.. అతడి నుంచి కీలకమైన రక్షణ సమాచారాన్ని రాబట్టినట్టు ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మే 31 రాత్రి అరెస్టయిన సదరు వింగ్ కమాండ్ర్పై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. సదరు మహిళ మొదట అతడి నమ్మకాన్ని సంపాదించి, ఆ తర్వాత సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం ప్రారంభించింది. సైనిక యూనిట్ల కదలికలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఆ మహిళతో వింగ్ కమాండర్ పంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.