కోల్కతా, సెప్టెంబర్ 26: కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది.
కేంద్రం వైఖరిని ఎండగడుతూ వచ్చే నెలలో రాజధాని ఢిల్లీలో భారీయెత్తున నిర్వహించే ఆందోళనలో భాగంగా ప్రజలు రాసిన 50 లక్షల లేఖలను కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ, గ్రామీణ ఆవాస్ యోజన కింద బెంగాల్కు రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులను కేంద్రం తొక్కిపెట్టిందని తృణమూల్ ఆరోపించింది.