Terror attack : జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని అమిత్షాను ప్రధాని ఆదేశించారు.
ఈ ఉగ్రదాడిపై అమిత్ షా స్పందిస్తూ.. పర్యటకులపై దాడి తీవ్రంగా బాధించిందన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించానని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించానని చెప్పారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం తాను శ్రీనగర్ వెళ్తున్నానిని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి ట్వీట్ చేశారు.
కాగా ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు.