Temperatures | న్యూఢిల్లీ : దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో ఇవాళ ఉదయం 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 37 నుంచి 40 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం 8:30 గంటలకు గాలిలో తేమ 64 శాతం వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఉక్కపోత కూడా అధికమవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం , సాయంత్రం సమయాల్లోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.