Loksabha Elections 2024 : ఈసారి లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా పాటలీపుత్ర ఎన్నిక ఆసక్తి రేపుతోందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ సహా విపక్ష ఇండియా కూటమి పట్ల ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం రబ్రీ దేవితో కలిసి పార్టీ అభ్యర్ధి మిసా భారతి తరపున పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, జెండాలు ఊపడం వరకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నయ వంచనతో బిహార్ను నట్టేట ముంచారని అంతకుముందు పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్ధి మిసా భారతి ఆరోపించారు.
ప్రధాని మోదీ పాటలీపుత్ర రావడం స్వాగతిస్తున్నామని, ఆయన రాకతో ఆ పార్టీకి రావాల్సిన మరో 5,000 నుంచి 10,000 ఓట్లు రాకుండా పోతాయని అన్నారు. బిహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్యత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని కాషాయ పాలకులు ఊదరగొట్టి ఉసూరుమనిపించారని చెప్పారు. బిహార్లో యువతకు ఉపాధి పేరిట పలు కర్మాగారాలు ప్రారంభిస్తామని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. తేజస్వి యాదవ్ యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.
Read More :
NIMS | నిమ్స్లో ‘గుండె మార్పిడి’ విజయవంతం