TB | భారత్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. మహమ్మారి తర్వాత దేశంలో టీబీ 16శాతం క్షీణించింది. ప్రపంచవ్యాప్త డేటాతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని పేర్కొన్నారు. స్టాప్ టీబీ పార్టనర్షిప్ 37వ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. భారత్లో మిస్ అయిన టీబీ కేసుల సంఖ్యను అంచనా వేసిన సంఖ్యకు, నోటిఫై చేసిన కేసులకు మధ్య వ్యత్యాసంగా నిర్వచించామని చెప్పారు. స్టాప్ టీబీ భాగస్వామ్యాన్ని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ (UNOPS) నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రెట్టింపు స్థాయిలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. దశాబ్దాలుగా టీబీ ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారిందని.. కొవిడ్-19 మహమ్మారితో ఏర్పడిన అంతరాయంతో రెండేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసుల్లో 8.7శాతం తగ్గడాన్ని గమనించినట్లు తెలిపారు. భారత్లో రెట్టింపు 16శాతం తగ్గిందన్నారు. 2025 నాటికి టీబీని అంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 1.6లక్షలకుపైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో 5 మిలియన్లకుపైగా టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ డ్రగ్ 3హెచ్పీ కోర్టులు, కమ్యూనిటీ స్థాయిలో టీబీ సేవలు అందించడం తదితర కార్యక్రమాలను ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.