చెన్నై, మార్చి 20: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. తమిళిసైపై డీఎంకే, వామపక్షాలు చేసిన విమర్శలను అన్నామలై ప్రస్తావిస్తూ.. ఉన్నత పదవుల్లో ఉన్న వారు పదవీ విరమణ చేసి సాధారణ వ్యక్తిగా ప్రజల కోసం మళ్లీ పనిచేయడం ఒక్క బీజేపీలోనే సాధ్యమన్నారు. బీజేపీ కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు పదవులు వదులుకోరని, వారికి ఎంతసేపు పదవులపై వ్యామోహం అని ఆయన ఆరోపించారు. 2019లో తమిళిసై తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందే బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా తమిళిసై వ్యవహరించారు. 62 ఏండ్ల తమిళిసై గైనకాలజిస్ట్. రెండు దశాబ్దాల క్రితం ఆమె బీజేపీలో చేరారు.