చెన్నై: తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి సీఎం స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేడు పూర్తిస్థాయిలో లాక్డౌన్ (Lockdown) విధించింది. దీంతో పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఆటోలు, ప్రీ పేయిడ్ ట్యాక్సీలు, క్యాబ్లు తిరగడానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో గత ఆదివారం నుంచి కరోనానిబంధనలను అమలు చేస్తున్నారు.
కాగా, తమిళనాడులో కొత్తగా 30,744 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 31,03,410కి చేరాయి. 1,94,697 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,372 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్క చెన్నై నగరంలోనే 6452 మంది కరోనా బారినపడ్డారు.