చెన్నై: తమిళనాడులోని రిజిస్ట్రేషన్ శాఖ(Registration Department)కు బుధవారం ఒక్క రోజే 180 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, దాని వల్ల ఆ ఆదాయం వచ్చినట్లు తమిళనాడు సర్కార్ తెలిపింది. శుభముహూర్తం రోజుల్లో ఎక్కువ శాతం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని, ఆ రోజుల్ని ప్రజలు మంగళకరమైనవిగా భావిస్తారని, దాని వల్లే టైమ్ స్లాట్ బుకింగ్ కోసం అదనపు టోకెన్లను జారీ చేశామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీ బుకింగ్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టార్ ఆఫీసులకు అదనపు టోకెన్లు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దాని వల్లే బుధవారం రోజున 180 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. అక్టోబర్ 20వ తేదీన కూడా శుభముహూర్తం ఉందని, ఆ రోజు కోసం కూడా అదనపు టోకెన్లతో పాటు తాత్కాల్ టోకెన్లు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భూమి, అపార్ట్మెంట్ల కొనుగోలు, అమ్మకాలతో పాటు పెళ్లి రిజిస్ట్రేషన్ల కోసం ఎక్కువ డాక్యుమెంట్ వర్క్ జరుగుతుంది.