చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడ ఈ ఉదయం 9 గంటల వరకు 13.80 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పెరియాకులంలో ఓటువేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. వరుసగా మూడోసారి అన్నాడీఎంకేనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని ఆయన జోష్యం చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్