Siddipet | సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట – ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. అలాగే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ద్వారా సాగుకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. ఈ ధర్నాలో నారాయణపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు.