చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) నుంచి తమ రాష్ర్టాన్ని మినహాయించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తమ రాష్ర్టానికి చెందిన అనేక మంది గ్రామీణ విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణత సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దాని నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు కేంద్రానికి విజ్ఞప్తిచేస్తూ వస్తున్నది.