నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగు రౌండ్ల వరకూ పెరుగుతూ వెళ్లిన ఆయన ఆధిక్యం.. ఐదో రౌండ్లో భారీగా తగ్గింది. 9 వేల వరకూ వెళ్లిన సువేందు ఆధిక్యం.. 3110కు తగ్గడం గమనార్హం. ఆ లెక్కన రానున్న రౌండ్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆధిక్యం చేతులు మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.