Surya Tilak | శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా (Surya Tilak) ప్రసరించాయి. మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్ రాముడి నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలను దేశ ప్రజలు టీవీ లైవ్ ద్వారా వీక్షించారు.
ఇక ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ఈ అపురూప దృశ్యాలను తన ట్యాబ్లో లైవ్ ద్వారా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ అద్భుత క్షణాన్ని చూసే అవకాశం తనకి లభించిందన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీరామ జన్మభూమి ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచే క్షణంగా అభివర్ణించారు.
అంతకు ముందు దేశ ప్రజలకు ప్రధాని రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి కృప వల్లే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చూడగలిగానని చెప్పుకొచ్చారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన మదిలో శక్తిని నింపుతున్నట్లు చెప్పారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని పేర్కొన్నారు. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని మోదీ ఆకాంక్షించారు.
नलबाड़ी की सभा के बाद मुझे अयोध्या में रामलला के सूर्य तिलक के अद्भुत और अप्रतिम क्षण को देखने का सौभाग्य मिला। श्रीराम जन्मभूमि का ये बहुप्रतीक्षित क्षण हर किसी के लिए परमानंद का क्षण है। ये सूर्य तिलक, विकसित भारत के हर संकल्प को अपनी दिव्य ऊर्जा से इसी तरह प्रकाशित करेगा। pic.twitter.com/QS3OZ2Bag6
— Narendra Modi (@narendramodi) April 17, 2024
Also Read..
Surya Tilak | బాలరాముడికి సూర్యతిలకం.. అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు
Sri Rama Navami | భద్రాద్రి ఆలయంలో వైభవంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
PV Sindhu | తిరుమల శ్రీవారి సేవలో స్టార్ షట్లర్ పీవీ సింధు