అహ్మదాబాద్: మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగే రోబోను (Rickshaw Pull Robot) నలుగురు విద్యార్థులు తయారు చేశారు. దీని కోసం 25 రోజులు శ్రమించడంతోపాటు రూ.30,000 ఖర్చు చేశారు. రిక్షాను లాగే ఈ రోబోకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు వినూత్నంగా ఒక రోబోను తయారు చేశారు. ఇది మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగుతుంది. రీచార్జ్ చేసే బ్యాటరీ పవర్ ద్వారా ఈ రోబో పని చేస్తుంది. దీనిని తొలిసారి రోడ్డుపై ప్రయోగాత్మకంగా నడిపి పరిశీలించారు.
కాగా, పలు రంగాల్లో సహాయపడే రోబోలను గతంలో కూడా తయారు చేసినట్లు దీనిని రూపొందించిన విద్యార్థుల్లో ఒకరైన మౌర్య శివం తెలిపారు. మనుషులు నడిచే విధానాన్ని పరిశీలించిన తర్వాత అలా నడుస్తూ రిక్షాను లాగే ఈ రోబోకు రూపకల్పన చేసినట్లు వివరించారు. దీని కోసం 25 రోజులు శ్రమించామని, ఇప్పటి వరకు రూ.30,000 వ్యయం చేసినట్లు వివరించారు. ఈ రోబోను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని విద్యార్థి శివం వెల్లడించారు. అయితే రోడ్డుపై నడుస్తూ రిక్షా లాగుతున్న రోబోకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.
Exciting news! A team of four students from Surat has created a humanoid robot capable of walking like a human and even pulling a rickshaw. This innovation showcases the potential of technology and its impact on everyday life. Congrats to the team! #HumanoidRobot #Innovation… https://t.co/2rL4NBCWDS
— Hazel Jason (@HazelJason2) April 12, 2023
Also Read: