న్యూఢిల్లీ: ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆర్డినెన్స్పై స్టే ఇచ్చే అంశాన్ని జూలై 17న పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఢిల్లీ ప్రభుత్వానికే బ్యూరోక్రాట్లను బదిలీ చేసే హక్కు ఉంటుందని మే 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.