VVPat Slip | న్యూఢిల్లీ: ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. ‘ఎన్నికల ప్రక్రియకు పవిత్రత ఉండాలి. ఒక వేళ ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ కనుక పొందితే ఎన్నికల సంఘానికి ఏమన్నా నష్టం కలుగుతుందా? అని ప్రశ్నించింది.