BBC India | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిందూసేన అధ్యక్షుడు బీబీసీని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో శాంతి, సమగ్రతకు భంగం కలిగించేందుకు బీబీసీ, బీబీసీ ఇండియా ప్రయత్నిస్తున్నాయని పిటిషన్లో పిటిషనర్లు విష్ణుగుప్తా, బీరేంద్ర కుమార్ ఆరోపించారు.
భారత్కు వ్యతిరేకంగా డాక్యుమెంటరీని రూపొందించినందుకు జర్నలిస్ట్పై దర్యాప్తు చేయాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోర్టును కోరారు. బీబీసీ తన సొంత ఎజెండాను నడుపుతోందని, దేశంలో నెలకొన్న శాంతి, జాతీయ సమైక్యతకు బీబీసీ భంగం కలిగిస్తోందని పిటిషన్లో ఆరోపించారు. అయితే, కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్-2022 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి నిషేధించిన విషయం తెలిసిందే. డాక్యుమెంటరీని సైతం బ్యాన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.